కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో `వరిసు(తెలుగులో వారసుడు)` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. హీరో శ్రీకాంత్, ప్రభు, ఖుష్బు, శరత్ కుమార్, సంగీత, సంయుక్త, యోగిబాబు తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రటకన కూడా వచ్చేసింది.
షూటింగ్ సైతం ఆఖరి దశకు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్ తాజా ప్రారంభం అయింది. రెండుయాక్షన్ సీక్వెన్సులు మరియు రెండు పాటలు మాత్రనే బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అన్ని వైపుల నుంచి ఈ చిత్రానికి భారీ ఆఫర్లు వస్తున్నాయి.
అయితే తాజాగా మేకర్స్ `వారసుడు` ఆడియో రైట్స్ ను విక్రయించారట. ఓ ప్రముఖ సంస్థ ఈ సినిమా ఆడియో రైట్స్ దాదాపు రూ.10 కోట్లకు కొనుగోలు చేశారట. ఈ ఫిగర్ అటు విజయ్ కెరీర్లోనూ.. ఇటు థమన్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ అని టాక్ నడుస్తోంది. దీంతో `వారసుడు` ఆడియో రైట్స్ వెరీ కాస్ట్లీ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!