Periods: పీరియడ్స్ అనేవి ప్రతి నెల వచ్చేవే.. కానీ ఆ సమయంలో భరించలేనంత నొప్పి వస్తుంది.. ఆ నొప్పిని కంట్రోల్ చేయడానికి ప్రతి నెల మందులు వేసుకుంటారు చాలా మంది.. అవి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ నొప్పికి చెక్ పెట్టాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలు.. ఆ సమయంలో మీ డైట్లో భాగం చేసుకోవాలి.. అదేవిధంగా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే నొప్పి ఎక్కువ అవుతుంది.. ఆ ఆహారపదార్థాలు ఏంటంటే..!?
రుతుక్రమం సమయంలో ఐరన్ లెవెల్స్ తగ్గి నీరసం వస్తుంది. అందుకని పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో అల్లం ను ఎక్కువగా తీసుకోవాలి. మీరు వండుకునే కూరలో అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించాలి. డార్క్ చాక్లెట్ కూడా ఈ నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. చాక్లెట్ లో ఐరన్, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇక తాజా పండ్లు, సొంపు గింజలు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, అరటి పండు, నారింజ, పుచ్చకాయ లను ఆ టైమ్ లో ఎక్కువగా తినాలి.
Read More: Periods: మాత్రలు లేకుండా నెలసరి ఆలస్యంగా రావడానికి ఈ సింపుల్ చిట్కా చాలు..
బహిష్టు సమయంలో ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఇందులో ఉండే సోడియం వలన పొత్తి కడుపు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. మైదా వంటకాలైన పిజ్జా, బ్రెడ్, బిస్కెట్, పరోటా వంటకాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవి అజీర్తి, మలబద్దకం, అపానవాయువు, రక్తంలో చక్కెర అసమతుల్యత వంటి సమస్యలను కలిగిస్తుంది. స్వీట్లు, శీతల పానీయాలు, చక్కెర ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ప్రాసెస్ చేసిన మాంసం, పాలు, మాంసం, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వంటివి తాగకూడదు. ఇవి నొప్పిని తీవ్రం చేస్తాయి.