Israel-Gaza War: గాజాలో భూతల పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్య, దక్షిణ గాజాలో జరిగిన పోరులో 15 మంది సైనికులు మరణించారు. క్షిపణి దాడిలో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు ఇజ్రాయిల్ సైనికులు మృతి చెందగా, హమాస్ తో జరుగుతున్న వీధి పోరాటాల్లో 11 మంది సైనికులు మరణించారు.
ఇప్పటి వరకూ యుద్దంలో 154 మంది ఇజ్రాయిల్ సైనికులు మృతి చెందారు. యుద్దంతో భారీగా నష్టపోతున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మరో దారి లేదనీ, పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని అన్నారు. యుద్దం పూర్తి అయ్యే వరకూ, విజయం సాధించే వరకూ అన్ని బలగాలను వినియోగిస్తామని ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాని నెతన్యాహు తెలిపారు.
మరో పక్క ప్రధాని నెతన్యాహు వైదొలగాలంటూ వేల మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ లో వేల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడికి బాధ్యత వహిస్తూ నెతన్యాహు పదవి నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు. బీబీ .. బీబీ .. మీరు మాకొద్దు అంటూ నినదించారు. నెతన్యాహు నిక్ నేమ్ బీబీ. అందుకే ఆ విధంగా నినదించారు.
TDP Proddatur: ప్రొద్దుటూరు టీడీపీలో నాలుగు స్తంబాలాట..టికెట్ దక్కెదెవరికో..?