Pawan Kalyan: నేడు క్రిస్మస్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ఒకటి. క్రైస్తవులు అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగలో క్రీస్తు జననం యొక్క పవిత్రత మరియు లోకానికి ఆయన రావడానికి ప్రధాన కారణం గురించి స్మరించుకుంటారు. ఇక ఇదే సమయంలో ఒకరికి మరొకరు బహుమతులు అందించుకుంటారు. ఇదిలా ఉంటే క్రిస్మస్ పండుగ సమయంలో ప్రతి ఏడాది జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో సతీమణి శ్రీమతి అనా రకరకాల బహుమతులు ఇతరులకు పంపిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆమె ప్రీ క్రిస్మస్ వేడుకలు ఓ అనాధ శరణాలయంలో జరుపుకోవడం జరిగింది.
హైదరాబాదు బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్స్ లోనిన్ పిల్లలతో కలిసి ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి అనంతరం అనాధ శరణాలయానికి నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ క్రమంలో అనాధ శరణాలయం నిర్వాహకులు పవన్ సతీమణి అనానీ సత్కరించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం జరిగింది. పవన్ సతీమణి శ్రీమతి అనా.. అసలు సిసలైన క్రిస్మస్ సరైన ప్రదేశంలో జరుపుకున్నారని నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ప్రేమ, కరుణ, క్షమాగుణాలను తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన ఏసు క్రీస్తు జన్మించిన పర్వదినం క్రిస్మస్. ఈ పవిత్ర పండుగ తరుణాన క్రైస్తవ మత ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సామాజిక విలువలు చైతన్యవంతం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం సర్వదా ఆచరణీయం. ప్రతి మనిషీ ఎంతో కొంత పరోపకార గుణం అలవరుచుకోకపోతే జీవితానికి అర్ధం ఉండదని క్రైస్తవం బోధిస్తుంది. ఈ క్రిస్మస్ పర్వదినాన దేశ ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ నా పక్షాన, జనసిన శ్రేణుల పక్షాన మనసారా కోరుకుంటున్నాను..అని పవన్ పోస్ట్ పెట్టడం జరిగింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!