Corona: 2019 నవంబర్ నెలలో చైనా(China) దేశంలో బయటపడిన కరోనా వైరస్(Corona Virus) ప్రపంచ స్థితిగతులను మార్చేయడం తెలిసింది. ఈ వైరస్ కారణంగా చాలామంది మనుషులు చనిపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ ఈ వైరస్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విరుగుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం జరిగింది. అయినా కానీ కొన్ని దేశాలలో కొత్త కొత్త వేరియంట్ లు వస్తూ ఉండటంతో… ఇప్పుడప్పుడే కరోనా భూమిని వదిలే ప్రసక్తే లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకి అక్కడ కొత్త కేసులు వేలల్లో నమోదు అవుతూ ఉండటంతో.. ఉత్తర కొరియా(North Korea) ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తుంది. కరోనా బయటపడిన ప్రారంభంలో ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ప్రపంచం మొత్తం ఆ టైంలో కాకా వికలం అయిపోయే తరహాలో ఉంది. కానీ ఇప్పుడు ఉత్తర కొరియాలో మహమ్మారి భయంకరంగా విజృంభిస్తుంది. ఇటువంటి తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్(KIM) చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఉత్తరకొరియా దేశంలో కరోనా వ్యాప్తి చెందటానికి ప్రధాన కారణం గ్రహాంతర వాసులని తెలిపారు. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు కూడా గ్రహాంతరవాసుల వల్ల వచ్చినట్లు తేలిందని చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియా(South Korea) సరిహద్దు నుంచి గ్రహాంతర వాసులు బెలూన్ లలో ఈ వైరుస్ నింపి ఉత్తర కొరియాలో రిలీజ్ చేశారని ఆరోపించారు. కాగా కిమ్ జాంగ్.. కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా దేశం వలెనే ఉత్తర కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని ఆరోపించారు. ఇప్పుడు గ్రహాంతర వాసులపై ఆరోపణలు చేయటం ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!