Remdesivir : దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ రెండవ దశ వేగంగా విస్తరిస్తోంది. లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. కరోనా చికిత్సలో కీలకమైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరకక కరోనా బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ తగిన విధంగా సప్లై లేకపోవడంతో బ్లాక్ లో విక్రయాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
కరోనా చికిత్సలో కీలకమైన ఔషదం రెమ్డెసివిర్, దాని ముడి పదార్ధాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్యా ఈ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని వల్ల ఔషద లభ్యత పెరగడంతో పాటు ఖరీదు తగ్గుతుంది. ఈ తాజా వెసులుబాటు అక్టోబర్ 31వ వరకూ అమల్లో ఉంటుందని కేంద్రం పేర్కొంది.
కోవిడ్ బాధితుల ఆరోగ్య సంరక్షణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెమిడిసివర్ ఏపిఐలు, ఇతర ముడి సరుకులపై మినహాయింపు కల్పించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రెమిడిసివర్ ఏపిఐ సరఫరా పెరగడంతో పాటు ధర తగ్గుతుందని, దీంతో కరోనా బాధితులకు కొంత మేర ఉపశమనం కలుగుతుందన్నారు.
రెమిడిసివర్ వ్యాక్సిన్ డిమాండ్ పెరగడం, బ్లాక్ లో ఇంజక్షన్ అమ్మడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 11వ తేదీన ఈ ఇంజక్షన్, ఏపిఐల ఎగుమతులను నిషేదించింది.
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న తరువాత ఔషద కంపెనీలు రెమిడిసివర్ ఇంక్షన్ ధరలను తగ్గించాయి. కాడిలా హెల్త్ కేర్ రెమ్ డాక్ (రెమిడిసివర్ 100 ఎంజీ) ఇంజెక్షన్ ధర రూ.2,800ల నుండి రూ.899లకు తగ్గించగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ (హైదరాబాద్) రెడ్వైఎక్స్ ధరను రూ.5,400ల నుండి రూ.2,700లకు తగ్గించింది. అలాగే సిప్లా తన సిప్రేమి బ్రాండ్ ధరను రూ.4వేల నుండి రూ.3వేలకు, మెలన్ తన వ్యాక్సిన్ ధరను రూ.4,800 ల నుండి రూ.3,400లకు, సింజీన్ ఇంటర్నేషనల్ తన బ్రాండ్ రెమివిన్ ధరను రూ.3,950ల నుండి రూ.2,450లకు తగ్గించింది.
In line with PM @NarendraModi's priority to ensure affordable medical care for COVID-19 patients, imports of Remdesivir API, injection and specific inputs have been made import duty free. This should increase supply and reduce cost thus providing relief to patients. pic.twitter.com/F40SX8mNeS
— Piyush Goyal (@PiyushGoyal) April 20, 2021