Ganga River: గంగానదీ జలాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు. గంగాజలాన్ని చల్లుకుంటే పునీతులు అవుతారనే నమ్మకం. అందుకే చాలా మంది గంగాజలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధిలో ఉంచి పూజిస్తారు. ఈ జలం ఎన్ని రోజులైనా స్వచ్చందంగా ఉంటుంది. ఇది అంతా కరోనాకు పూర్వం. గత కొన్ని సంవత్సరాలుగా గంగానది మురికికూపంగా తయారు అయ్యింది. ఇది భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గంగా నదీ పరివాహక ప్రాంతంలోని అనేక నదీ తీరాలు ఆకుపచ్చగా మారుతున్నాయి. గంగానది నీరు కలుషితం అయి తీవ్ర దుర్ఘంధం వెదజల్లుతోంది. చెరువులు, సరస్సుల నుండి నాచు అధికంగా రావడం వల్ల వర్షాకాలంలో లేత ఆకుపచ్చ గా మారుతుంది. అయితే ఈ సారి ఆ రంగు అధికంగా కనబడుతోంది. గతంలో కొన్ని ఘాట్ లలో మాత్రమే ఆకుపచ్చగా కనబడేది కానీ ఇప్పుడు దాదాపు వారణాసిలోని 84 ఘాట్ లలో నీరు ఆకుపచ్చగా దర్శనమిస్తోంది. ఈ నీటి నుండి దుర్వాసనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నది నీరు ఆకుపచ్చగా మారడానికి మైక్రోసిస్టిస్ ఆల్కే కారణం అయి ఉండవచ్చని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని మాలవియా గంగా పరిశోధనా కేంద్రం అధ్యక్షుడు డాక్టర్ బిడి త్రిపాఠి పేర్కొంటున్నారు. పారే నీటిలో ఆల్గేను కనుగొనవచ్చని చెప్పారు. కానీ ఇది సాధారణంగా గంగానదిలో కనిపించదన్నారు. ఎక్కడ నీరు ప్రవాహం లేకుండా నిలిచిపోతుందో అక్కడ పోషక స్థితి ఏర్పడుతుందన్నారు. దీని వల్ల మైక్రోసిస్టమ్స్ పెరుగుతాయని పేర్కొన్నారు. సాధారణంగా ఇది చెరువులు, కాలువల నీటిలో మాత్రమే పెరుగుతుందన్నారు.
పర్యావరణ శాస్త్రవేత్త కృపా రామ్ మాట్లాడుతూ నీరు విషపూరితం అయ్యిందా ఆకుపచ్చ రంగు చాలా కాలం పాటు ఉంటుందా అనే విషయాలపై పరిశోధించాలన్నారు. గంగానది నీరు ఆకుపచ్చ రంగు మారడానికి ప్రధాన కారణంలో వర్షం కూడా ఒకటి కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డాక్టర్ కృపారామ్. నీటిలో లవణాలు పెరిగినప్పుడు ఆకుపచ్చ ఆల్గే ఎక్కువగా కనిపిస్తుందన్నారు.