NewsOrbit
జాతీయం న్యూస్

కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంలో 134కు చేరిన మృతుల సంఖ్య …వంతెన నిర్వహణ సంస్థపై కేసు నమోదు

గుజరాత్ మోర్బీలో కేబుల్ వంతెన కుప్పకూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 134 కు చేరింది. మచ్చు నదిపై బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ తీగల బ్రిడ్జ్ కి ఇటీవల మరమ్మత్తులు పూర్తి చేసి ప్రారంభించారు. మరమ్మత్తులు పూర్తి అయి ప్రారంభించిన అయిదు రోజుల వ్యవధిలోనే ఆదివారం కేబుల్ బ్రిడ్జ్ కూలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనపై ఆదివారమే హైపవర్ కమిటీని నియమించిన ప్రభుత్వం .. తాజాగా వంతెన నిర్మాణ ఏజన్సీపై 304, 308, 114 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. మరో వైపు .. సహాయక సిబ్బంది 177 మందిని సురక్షితంగా కాపాడినట్లు రాష్ట్ర సమాాచార శాఖ పేర్కొంది. 19 మందికి గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించింది. ఆర్మీ, నెేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

Gujarat CM Bhupendra Patel

 

ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది సందర్శకులు ఉన్నట్లు తెలుస్తొంది. వంతెనపై ఉన్న కొంత మంది యువకులు ఆకతాయితనంతో ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ వంతెనను ఊపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కేబుల్ బ్రిడ్జ్ కూలిపోవడంతో చాలా మంది నీటిలో పడి గల్లంతయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉండగా, వందల మంది గాయపడ్డారు. ప్రమాదం కారణంగా సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితిలు కనిపించాయి. ఈత వచ్చిన వారు ఒడ్డుకు చేరుకోగా, ఈత రాని వారు మునిగిపోతూ హెల్ప్ హెల్ప్ అంటూ హాహాకారాలు చేశారు.

Gujarat CM Bhupendra Patel

 

వంతెన కూలిన విషయం తెలియడంతోనే పోలీసు,, అగ్నిమాపక విభాగం అధికారులు, ఇతర సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం పడవల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుండి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అంతకు ముందు మోర్బీ జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల అధికారుల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ఈ తెల్లవారుజామున కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సీఎం భూపేంద్ర పటేల్ చేరుకుని రెస్క్యూ ఆపరేషన్, క్షతగాత్రులకు వైద్య సేవలు, బాధిత కుటుంబాలను ఆదుకోవడం తదితర విషయాలపై తగిన ఆదేశాలు జారీ చేశారు.

KCR: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మౌనం వీడి ఘాటుగా స్పందించిన సీఎం కేసిఆర్ .. ఎమన్నారంటే ..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N