Morbi Bridge Collapse: గుజరాత్ లోని మోర్జీలో కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలి 134 మంది ప్రాాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ … మంగళవారం (నేడు) మోర్జీలో పర్యటించనున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మోడీ పరామర్శించనున్నారు. మరో పక్క ప్రధాన మంత్రి మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో జరిగిన ఈ దుర్ఘటనను పురస్కరించుకుని విపక్షాలు మోడీని లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్నాయి. సోషల్ మీడియాలో గో బ్యాక్ మోడీ (Go Back Modi), షేమ్ లెస్ (Shameless) అనే హాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ అవుతున్నాయి. గతంలో 2016 మార్చి 31న పశ్చిమ బెంగాల్ లో నిర్మాణంలో ఉన్న వివేకానంద రోడ్ ఫ్లై ఓవర్ కుప్పకూలిన ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
అప్పట్లో ఎన్నికల ప్రచారం కోసం బెంగాల్ వెళ్లిన సందర్భంలో ప్రధాని మోడీ .. సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఇంత పెద్ద బ్రిడ్జ్ కూలిపోతే ఇిద దేవుడు చేసిన పని అని అంటున్నారనీ, ఇది దేవుడు చేసిన పని కాదనీ, అవినీతి చర్య అని అన్నారు. అవినీతి ఫలితంగానే బ్రిడ్జ్ కూలిపోయిందని, ఇది సిగ్గుచేటంటూ మమతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మోడీ. ఇప్పుడు మోర్బీ కేబుల్ వంతెన ఘటనను పురస్కరించుకుని విపక్షాలు .. అప్పట్లో మోడీ మాట్లాడిన వీడియోలను పోస్టు చేస్తూ ఎదురుదాడికి దిగారు. ఇప్పుడేమంటారు మోడీజీ అని టీఎంసీ, శివసేన నేతలు నిలదీస్తున్నారు. ఈ దుర్ఘటనకు సొంత పార్టీదే బాధ్యత అని అంగీకరిస్తారా అని ప్రశ్నించాయి. నాడు మోడీ మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరో పక్క మోర్బీ ప్రధాని పర్యటనను పురస్కరించుకుని యుద్ద ప్రాతిపదికన అర్ధరాత్రి ఆసుపత్రిలో మరమ్మత్తులు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రికి రాత్రే ఆసుపత్రిలో గోడలకు రంగులు వేయించడంతో పాటు అవసరమైన మరమ్మత్తులు అధికారులు చేపట్టారు. ఆసుపత్రిలో రంగులు వేయడం, మరమ్మత్తులు చేస్తున్న వీడియోలు, పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాన మంత్రి మోడీ ఫోటో షూట్ కోసం బీజేపీ బిజీబీజీ గా ఏర్పాట్లు చేస్తొందంటూ కాంగ్రెస్, అమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ వైపు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో జనం చనిపోవడం, బాధిత కుటుంబాలు తీరని దుఖంలో మునిగిపోగా బీజేపీ పెద్దలు మాత్రం ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లలో మునిగిపోవడం విచారకమని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో అంతా బాగుందని ప్రధానికి చూపించడం కోసం అధికారులు అర్ధరాత్రి ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఆప్ ట్వీట్ లో ఆరోపించింది.
This is not an act of God but an act of fraud. – Modi Ji#मोरबी pic.twitter.com/0bVL1kQRLA
— Sanjeev Jha (@Sanjeev_aap) October 30, 2022