WhatsApp: ప్రముఖ ఇన్స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ గత ఏడాది నవంబర్ నెలలో 71 లక్షల భారతీయ ఖాతాలపై నిషేదం విధించింది. రీసెంట్ గా విడుదల చేసిన యూజర్ సెఫ్టీ రిపోర్టు లో ఈ విషయాన్ని వెల్లడించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, యూజర్స్ నుండి అందిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగా 71 లక్షల ఖాతాలపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వీటిలో 19 లక్షల ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, సంస్థ నిబందనలను అతిక్రమించిన కారణంగా వాటిపై నిషేదం విధించినట్లు వెల్లడించింది.
నవంబర్ నెలలో యూజర్ల నుండి 8,841 వినతులు వచ్చాయని, వాటిలో స్పామ్ ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఖాతాలపై నిషేదం, ప్రొడక్ట్ సరోప్టు వంటివి ఉన్నాయని తెలిపింది. యూజర్లు ఫిర్యాదు చేసిన ఖాతాలపై యూజర్ సెఫ్టీ రిపోర్టు ఆధారంగా వాట్సాప్ లోని కృత్రిమ మేథ ఆధారిత సాంకేతిక వ్యవస్థ చేపట్టినట్లు తెలిపింది. అలాగే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ.. అసత్యాలను ప్రచారం చేస్తున్న ఖాతాలను గుర్తించి తొలగించినట్లు నివేదికలో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఐటీ రూల్స్ 2021 అనుసరించి లక్షలాది వాట్సాప్ ఖాతాలను తొలగించింది. ఇందుకు సంబంధించిన నివేదికను భారత ఐటీ శాఖకు అందించింది. గత ఏడాది భారత ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుండి నకిలీ అకౌంట్లు, స్పామ్ ఖాతాలు, తప్పుడు అకౌంట్లు రూపొందింస్తున్న వారికి వరుస షాక్ లు తగులుతున్నాయి.
భారత ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్స్ ఉన్న ప్రతి సోషల్ మీడియా సంస్థ మంత్లీ రిపోర్టును పబ్లిష్ చేయడంతో పాటు వారి నుండి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అందులో పొందుపర్చాలి. ఇందులో భాగంగానే వాట్సాప్ తాజా నివేదికను విడుదల చేసింది.
YSRCP MLA MS Babu: ‘అన్నీ మీరు చెప్పినట్లే చేశా..నేను చేసిన తప్పేమిటన్నా..?’