అమరావతి: ప్రజలందరికీ శుభ్రమైన తాగునీటిని అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకం కింద పనులను మూడు దశల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని జగన్ చెప్పారు. వాటర్ గ్రిడ్ పథకం కింద మొదటి దశలో శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశ జిల్లాలో, రెండవ దశలో విజయనగరం, విశాఖ, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో, మూడవ దశలో కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో శుభ్రమైన తాగునీటిని అందించాలని జగన్ స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.