కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రభుత్వం స్పందిస్తూ ఏపీలో ఆరోగ్య శాఖను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని. రాష్ట్రంలో ఇప్పటికే 11 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, మరో 16 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఆ సందర్భంగా చెప్పారు.
ఇప్పుడు దీనికి సంబంధించిన చర్యలకు పూనుకుంది ప్రభుత్వం. ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు 2.050 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. విశాఖ జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీకి 500 కోట్ల కేటాయించింది. అలాగే కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీకి మరో 500కోట్లు, కృష్ణ జిల్లా మచిలీపట్నంలో కాలేజీకి 550 కోట్లు కేటాయించింది. అలాగే పాడేరు, పులివెందుల,పిడుగురాళ్ల కాలేజీల్లో 100 చొప్పున MBBS సీట్లు ఉంటాయని తెలిపింది. ఇక మచిలీపట్టణం కాలేజీకి 150 సీట్లు కేటాయించింది. అమలాపురం,ఏలూరు, పులివెందుల, పిడుగురాళ్ల,మదనపల్లి ఆదోని కాలేజీ స్థలాలు కొనుగోలుకు 104.17 కోట్లు వెచ్చించనుంది.