నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్లుగా సరైన విజయాలు అందుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నాడు. సింహా సినిమాకు ముందు బాలయ్య ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. సింహాతో తన స్థాయి పెరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ప్లాపులే. మళ్ళీ లెజండ్ తో కొంత కుదురుకున్నట్లు కనిపించాడు. అయినా ప్లాపులు మాత్రం తగ్గలేదు.
మధ్యలో జై సింహా అంటూ ఒకటి రెండు ఒక మాదిరి విజయాలు వచ్చాయి అంతే. గతేడాది అయితే ఘోరం. వరసగా కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలతో ప్లాపుల మీద ప్లాపులు అందుకున్నాడు. ఈ మూడూ కూడా అడ్రెస్ లేకుండా డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ బోయపాటి శ్రీనుతో జట్టుకట్టడంతో నందమూరి అభిమానుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో సినిమా లాక్ డౌన్ కు ముందే ఒక షెడ్యూల్ నడిచింది. ఒక పెద్ద యాక్షన్ బ్లాక్ ను ఆ షెడ్యూల్ లో చిత్రీకరించారు.
ఇక ఇప్పుడు షూటింగ్ లు అందరూ మొదలుపెడుతుండడంతో బోయపాటి కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసాడు కానీ బాలయ్య మాత్రం ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. నవంబర్ వరకూ షూటింగ్ మాట ఎత్తొద్దు అంటున్నాడు. ఇకపోతే ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. దీంతో తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ సినిమా కోసం దాదాపు ఐదుగురు సిద్ధంగా ఉన్నారు.
తమ తమ కథలతో బాలయ్యను అప్రోచ్ అవుతున్నారు. ముందుగా వివి వినాయక్ లిస్ట్ లో ఉన్నాడు. వినాయక్ తో బాలయ్య రెండేళ్ల క్రితమే సినిమా చేయాల్సింది కానీ కుదర్లేదు. వచ్చే ఏడాది అది కుదురుతుంది అని టాక్. అలాగే పరుచూరి బ్రదర్స్, అనిల్ రావిపూడి, సాయి మాధవ్ బుర్రా కథలు బాలయ్యను దృష్టిలో పెట్టుకుని రాస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే బాలయ్య మాత్రం ఎవరికీ ఇంకా ఏ కమిట్మెంట్ ఇవ్వలేదు. బోయపాటి సినిమా పూర్తైన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!