అక్టోబర్ 15వ తేదీ నుండి సినిమా థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మిగిలి ఉన్న ఈ కొద్ది రోజుల్లోనే ఓటీటీ భవిష్యత్తు ఏంటో తేలిపోతుందని అందరూ అనుకున్నారు. ఇప్పటివరకు తెలుగులో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం విశేషం. ఇలాంటి సమయంలోనే ఓటిటి యజమాన్యానికి ఊపిరిలు ఊదేలా అనుష్క, మాధవన్ ప్రధాన తారాగణంగా నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రానికి మేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే…
కథ
అమెరికాలోని సియాటిల్ నగరంలో అమ్మాయిలు మిస్సింగ్ కేస్ లు పెరుగుతూ ఉంటాయి . ఇక అదే సమయంలో ఒక పాడుబడ్డ భవనంలోకి హీరోయిన్ అనుష్క, మాధవన్ ఒక పెయింటింగ్ కోసం వెళ్తారు. ఆ భవనంలో మాధవన్ హత్యకు గురి అవుతాడు. దీంతో అనుష్క భయపడి అక్కడి నుండి పారిపోతుంది. ఇక మాధవన్ ను ఎవరు చంపారు…? అతనిని చంపాల్సిన అవసరం ఏమి వచ్చింది అన్నది అసలైన కథ. ఇందులో అంజలి ఈ కేసుని సాల్వ్ చేసేందుకు నియమించబడిన డిటెక్టివ్ గా కనబడుతుంది. అంజలి కి తోడుగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘కిల్ బిల్’ ఫేమ్ మైఖేల్ మ్యాడ్సన్ తోడుగా ఉంటాడు. వీరిద్దరూ కలిసి ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు అన్నది కథాంశం. ఇక ఈ మధ్యలో అనుష్క కేసులో ఎలాంటి ముఖ్య పాత్ర పోషించింది..? శాలిని పాండే ఈ కథ మధ్యలోకి ఎలా వచ్చింది…? సుబ్బరాజు ఏం చేశాడు? అన్నవి ప్రేక్షకులను ఆలోచింపజేసే ఎలిమెంట్స్. ఈ మొత్తం తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.
పాజిటివ్స్
ఈ చిత్రానికి గోపీసుందర్ అద్భుతమైన బాణీలను అందించాడు. మెలోడీ మ్యూజిక్ ఇవ్వడంలో సిద్ధహస్తుడైన గోపీసుందర్ థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా వైవిధ్యభరితంగా అందించాడు. కొన్ని సీన్లకు అతడి సంగీతం ప్రాణం పోసింది అని చెప్పాలి. మాధవన్ అద్భుతమైన నటన కనబరిచాడు. అంత మంది స్టార్ తారాగణం లో అతని నటన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి మరొక పెద్ద ప్లస్ ఏమిటంటే ఛాయాగ్రహణం. అమెరికాలోని ఒక మహానగరం లో ఒక థ్రిల్లర్ తీసేటప్పుడు అక్కడ ఉన్న అందమైన ప్రదేశాలను వాడుకొని ఒక ఫ్రేమ్ ని ఎంత థ్రిల్లింగ్ గా…. భయంకరంగా చూపిస్తే గరిష్ఠంగా ఎంతటి ఫీల్ అయితే రాబట్టగలమో… సినిమాటోగ్రాఫర్ కూడా ప్రేక్షకులకు అంతటి మంచి ఫీల్ అందించాడు.
నెగటివ్స్
అస్సలు ఇంటరెస్ట్ కలగకుండా కథని రాసుకోవడం లో డైరెక్టర్, రైటర్ గా హేమంత్ మధుకర్ ఫెయిల్ అయ్యాడు. చాలా రొటీన్ కథాంశం ఎంచుకుని మన్మధ తో పాటు మరికొన్ని సౌత్ ఇండియన్ సినిమాల కలయికతో ఒక మర్డర్ మిస్టరీ రాసుకున్నాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఏమాత్రం కథలో ఇమడలేదు. స్క్రీన్ ప్లే చాలా స్లో గా, బోరింగ్ గా సాగుతుంది. కథనం అస్సలు బాగోలేదు . అనుష్క కారెక్టర్ ని కొంచెం కూడా హై లైట్ చేయలేకపోయారు. ఇంత చిన్న పాత్ర కోసం అనుష్క ఎందుకు అనే ప్రశ్న అందరి నుంచీ వస్తుంది. ఆఖర్లో అనుష్క హై లైట్ అవుతుంది అనే అనుకుంటారు అందరూ కానీ సినిమా అయిపోతుంది కానీ అలాంటిది ఏమీ జరగలేదు. పేలవమైన డైలాగ్ లు , ఆకట్టుకొని నటన బోర్ తెప్పిస్తాయి. సీన్ కీ సీన్ కీ మధ్య సింక్ ఉండదు, శాలిని పాండే కారెక్టర్ కి జస్టిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయాడు దర్శకుడు.
కంక్లూజన్ : మామూలుగానే భారతీయ సినిమాలో థ్రిల్లర్లకు కొరత ఉంటుంది. అయితే కోనవెంకట్ లాంటి రచయిత…. హేమంత్ మధుకర్ ఇలాంటి మంచి డైరెక్టర్ కలయికలో అనుష్క, మాధవన్ ప్రధాన తారాగణంగా నటిస్తూ అంజలి, శాలిని పాండే మంచి పర్ఫార్మర్స్ లో ఉన్న సినిమా కనీస స్థాయిని కూడా అందుకోలేకపోయింది. ఇదే సినిమా ఈ థియేటర్ లో చూసి ఉంటే ఎలా ఉండేది అన్న విషయం పక్కన పెడితే…. ముందు కథలో పెద్దగా కంటెంట్ లేదు. రొటీన్, బోరింగ్ స్క్రీన్ ప్లేతో అతి బలహీనమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్కిప్ చేయడం మంచిది. ఎమెజాన్ ప్రైమ్ కి మరొక డిజాస్టర్ సినిమా .