Kalyan ram : నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఓ కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు దిల్ రాజు బృందం. గతంలో 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తీసిన తమిళ డైరెక్టర్ కెవి గుహన్, ఈ సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. నివేథా థామస్, శాలినీ పాండే ఇందులో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంతమంచి వాడవురా మాత్రం నిరాశ పరచింది. దాంతో చిన్న గ్యాప్ తీసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు బింబిసార అనే సినిమా చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ మూవీగా తెరకెక్కుతున్న దీనితో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ రిలీజై కళ్యాణ్ రామ్ అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కెరీర్ ప్రారంభం నుంచి డిఫ్రెంట్ సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ హిట్. ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఒకవైపు నిర్మాతగా ఒకవైపు హీరోగా రెండు పడవల ప్రయాణం విజయవంతంగా చేస్తున్నాడు. కాగా ఆయన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తన 19వ సినిమా తెరకెక్కనుందని ప్రకటించాడు.
Kalyan ram : ‘118’ మాదిరిగానే మళ్ళీ కూడా కొత్త కాన్సెప్ట్
ఇక ఇదే ఈ క్రమంలో ఆయన 20వ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో నటించనున్నట్లు తాజాగా కళ్యాణ్ రామ్ ప్రకటించారు. కేవీ గుహన్ దర్శకత్వంలో తన 20వ సినిమా రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ కి బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ‘క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్’ అని చూపడాన్ని బట్టి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ – కేవీ గుహన్ కలిసి చేసిన ‘118’ మాదిరిగానే మళ్ళీ కూడా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!