విజయవాడ : అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండల కేంద్రంలోని బిసి హాస్టల్లో సోమవారం రాత్రి జరిగింది. దాసరి అదిత్య అనే విద్యార్థి అన్నతో కలిసి హాస్టల్లో ఉండి మూడవ తరగతి చదువుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్ బాత్ రూమ్లో ఆదిత్య గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ‘కింద రూమ్లో పడుకున్న బాలుడు రాత్రి పైకి ఎందుకు వెళ్లాడో తెలీదు. తెల్లారేసరికి బాత్ రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. బాత్ రూమ్కి డోర్ కూడా లేదు.’ అని హాస్టల్ వాచ్మెన్ నాగబాబు అంటున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చల్లపల్లి సిఐ వెంకట నారాయణ, ఎస్ఐ నాగరాజులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిత్య మెడ వద్ద కత్తితో కోసినట్లుగా ఉండటంతో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
previous post
next post