కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `మన్మథుడు 2`.రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కీలక పాత్రలో నటిస్తుండగా, సమంత గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు. సినిమా ఆగస్ట్ 9న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వివరాల ప్రకారం అడ్వాన్స్ బేసిస్లో 7 కోట్ల రూపాయలకు నైజాం హక్కులు అమ్మారట. అలాగే ఉత్తరాంధ్ర, కృష్ణా ప్రాంతాల్లో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. సీడెడ్లో 2.75 కోట్ల రూపాయలు, ఆంధ్ర రూ.7 కోట్ల(రేషియో).. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ.16.50 కోట్ల బిజినెస్ కాగా.. రెస్టాఫ్ ఇండియా 1.60 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 2.40 కోట్ల రూపాయలు బిజినెస్ ఇలా మొత్తంగా రూ.20.50 కోట్ల బిజినెస్ జరిగిందట.
previous post
next post
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!