Acharya : ఆచార్య మెగా స్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ. వాస్తవంగా ఆచార్య సినిమా గత ఏడాదిలోనే కంప్లీట్ చేయాలని సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. ఆ తర్వాత సమ్మర్ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే సంక్రాంతి, సమ్మర్ కి టార్గెట్ మిస్ అయింది. కరోనా వల్ల షూటింగ్స్ దశలోనే ఉండి వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కూడా ఇంకా బ్యాలన్స్ ఉంది. కాగా కరోనా సెకండ్ వేవ్ నుండి పరిస్థితులు చక్కబడడంతో ఇటీవల మళ్లీ సినిమాల షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి.
చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ అన్నీ సినిమాల షూటింగ్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆచార్య షూటింగ్ కూడా ప్రారంభం అయింది. నేటి నుండి ఆచార్య సినిమా షూటింగ్ మొదలయినట్టు మేకర్స్ వెల్లడించారు. మెగాస్టార్ తో పాటు చరణ్, సోనూసూద్ అలాగే కీలక పాత్రలు పోషిస్తున్న నటీ నటులపై కొరటాల పెండింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. కేవలం వారం నుండి పది రోజుల్లోనే ఈ షెడ్యూల్ పూర్తి చేస్తారట. అన్నీ జాగ్రత్తలతో ఆచార్య షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఒకవైపు షూటింగ్ ను జరుపుతూనే మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుపుతున్నారట.
Acharya : చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇక భారీ స్థాయిలో అంచనాలున్న ఆచార్య సినిమా విడుదల తేదీ విషయంలో అందరిలోనూ ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. దసరా సీజన్ లో ఆచార్య సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికి ఇప్పటికే పోస్ట్ పోన్ అయిన సినిమాలు పోటీ ఉండే అవకాశం ఉంది. దాంతో ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జులై మూడు వారం నుండి థియేటర్లు ఓపెన్ అవుతాయట. ఆగస్టు మొదటి నుంచి థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తోంది. ఇందులో చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్ పూజా హెగ్డే హీరోయిన్స్గా నటిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!