ఆచార్య.. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం.. లాంటి పాన్ ఇండియన్ సినిమాలన్ని సమ్మర్ టర్గెట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇంకా కరోనా భయం వెంటాడుతూనే ఉంది. దాంతో ప్రభూత్వం నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే అనుమతులు లభించాయి. మరి 100 పర్సెంట్ ఆక్యుపెన్సీకి ప్రభూత్వం అనుమతులు ఎప్పుడు ఇస్తుందో తెలీదు గాని గత ఏడాది నుంచి కొన్ని భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమాలని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు.
ఈసారి సమ్మర్ రేస్ లో పాన్ ఇండియన్ సినిమాలుండటం విశేషం. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సమ్మర్ లో అంటే జూన్ లేదా జూలై లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుండగా ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు హీరోలుగా భారీ మల్టీస్టార్ సినిమాగా రూపొందుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ ల కాంబినేషన్ లో ఆచార్య రూపొందుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని సమ్మర్ లో అంటే మే లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
డార్లింగ్ ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యాం సినిమా కూడా సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా 250 కోట్ల భారీ బడ్జెట్ తో పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. చెప్పాలంటే రాధే శ్యాం.. ఆర్ ఆర్ ఆర్ సినిమాలు అనుకున్న సమయానికంటే సంవత్సరం పైనే దాటిపోయింది. ఇలా మరికొన్ని సినిమాలు సమ్మర్ టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి కాలేజీలకి సెలవులు ఉండే అవకాశం లేదంటున్నారు. ఇదొక సమస్య అయితే 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలన్ని సమ్మర్ లో రిలీజ్ చేసే ఆర్ధికంగా నష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!