నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతుంది. సింహ, లెజెండ్ సినిమాలతో బాలయ్య కెరీర్ పీక్స్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకి ముందు వరసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. అయితే బోయపాటి ఇచ్చిన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మళ్ళీ బాలకృష్ణ వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ హ్యాట్రిక్ సినిమా సక్సస్ ఇప్పుడు అటు బాలకృష్ణ కి ఇటు బోయపాటికి ఎంతో కీలకంగా మారింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో వినయ విధేయ రామ తీసి భారీ ఫ్లాపును చూశాడు బోయపాటి శ్రీను. చెప్పాలంటే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదట.
దాంతో ఎట్టకేలకి మళ్ళీ బాలయ్య నే బోయపాటికి ఛాన్స్ ఇచ్చాడు. ఇక బాలయ్య కూడా తన తండ్రి జీవిత కథని రెండు భాగాలుగా తీసి పరాజయాలని అందుకున్నాడు. సినిమా జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని విడి విడిగా ఎన్.టి.ఆర్ కథానాయకుడు.. ఎన్.టి.ఆర్ మహానాయకుడు అంటూ తీసిన రెండు సినిమాలు బాలయ్యకి ఊహించని షాకిచ్చాయి. ఇక ఆ తర్వాత తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ తో తీసిన రూలర్ కూడా ఫ్లాప్ గా మిగిలింది. దీంతో మళ్ళీ బోయపాటినే నమ్మాడు బాలయ్య. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో తయారవతున్న తాజా చిత్రం కొంత టాకీ పార్ట్ జరుపుకొని లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది.
అయితే జూన్ 10 న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ తాజా చిత్రానికి సంబందించి సర్ప్రైజ్ న్యూస్ రాబోతుందని అంటున్నారు. మోనార్క్ అన్న టైటిల్ అనుకున్నారని ఆ టైటిల్ తో బాలయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తాజా సమాచారం. ఇక ఇప్పటి వరకు బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ ఎవరో తెలియదు గాని ఒక కీలక పాత్రలో మాత్రం సీనియర్ నటి రోజా నటించబోతుందట. గతంలో బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో భైరైవ ద్వీపం, బొబ్బిలి సింహం వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. అయితే రోజా చేసే పాత్ర ఎంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు బోయపాటి బృందం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!