Adavi Sesh: హీరో అడవి శేష్ అందరిలా కాకుండా తనకు నచ్చిన జానర్లోనే సినిమాలు తీస్తూ.. వాటిలో హీరోగా నటిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు.. హైదరాబాద్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పటి నుంచో తాగునీటి సమస్య ఉంది.. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ హీరో అడవి శేష్ ఇటీవల 865 లీటర్ల ప్యాకేజీ తాగునీటిని కోటి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం 300 పైగా కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ఈ ఆసుపత్రిలో తాగు నీటి సమస్య తో అక్కడికి వస్తున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చేదందుకు అడవి శేష్ నడుం బిగించారు.. 1000 లీటర్ల తాగునీటిని శుద్ధి చేసే వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.. ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్యను పరిష్కరించిన అడివి శేష్ ను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు..
ప్రస్తుతం అడవి శేష్ మేజర్ చిత్రం లో నటిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది.. ఇటీవల ఈ సినిమా పోస్టర్, టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. తాజగా అడవి శేష్ హీరో -2 అనే సినిమాలో కూడ నటిస్తున్నారు. ఇటివల ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంటుంది..