దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరగటంతో ప్రధాని మోడీ ఈనెల 16, 17 తేదీలలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు మరియు సడలింపులు చాలా వరకు ఎత్తివేసిన తరువాత ఊహించని విధంగా కేసులు బయటపడటంతో మళ్లీ దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మోడీ ముఖ్యమంత్రులతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కరోనా వ్యాధి ఉన్న కొద్దీ పెరగటంతో మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ స్వతహాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు జిల్లాలలో రోజు రోజుకి కొత్త కేసులు ఊహించని విధంగా బయట పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఆధ్వర్యంలో… ఈ నాలుగు జిల్లాలలో 19 నుంచి 30 వరకు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయడానికి రెడీ అయ్యింది. ఈ తరుణంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. కరోనా ప్రభావం ఈ జిల్లాలలో ఎక్కువగా ఉండటంతో పళనిస్వామి క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.