Google Chrome: ఇపుడు ప్రపంచంలో గూగుల్ క్రోమ్ ని ఉపయోగించనిది ఎవరు? ప్రపంచ వ్యాప్తంగా క్రోమ్ బ్రౌసర్ చాలా ఫేమస్. అందులోనూ మన ఇండియాలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇక్కడ దాదాపు 90 శాతం మంది క్రోమ్ లోనే బ్రౌసింగ్ చేస్తారని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. రకరకాల లావాదేవీలకు, విలువైన సమాచారానికి, మెయిలింగ్ కి.. ఇలా ఒక్కటేమిటి అనేక విధాలుగా మనం అనునిత్యం ఇంటర్నెట్ పైన ఆధారపడవలసిన పరిస్థితి వుంది. ఇలాంటి తరుణంలో ఏకంగా క్రోమ్ బ్రౌసర్ నే వాడకూడదంటే ఒకింత కష్టమే మరి!
Google: 2021లో గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తులు వీరే..!
క్రోమ్ తో వచ్చిన సమస్య ఏమిటి?
తాజాగా CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) గూగుల్ క్రోమ్ యూజర్లను అలెర్ట్ చేసింది. అసలు విషయం ఏమంటే, క్రోమ్ లోని బగ్స్ ఉన్నాయని తేలింది. అలాగే ఇక్కడ వినియోగదారుల గోప్యత కూడా కష్టంగా మారిందని అంటున్నారు. అంతేకాకుండా టూల్ లోకి మాల్వేర్ చొరబడే ప్రమాదం కూడా లేకపోలేదని పేర్కొన్నారు. ఇకపోతే, తాజా సమాచారం ప్రకారం, Google ఈ లోపాన్ని సరిదిద్దింది. దాని కోసం ఒక అప్ డేట్ ను కూడా జారీ చేసింది. కానీ విషయం తెలియని యూజర్స్ చాలామంది మామ్మూలుగానే క్రోమ్ ను వాడేస్తున్నారని, అది చాలా ప్రమాదమని వారు సూచిస్తున్నారు.
Google Pay: గూగుల్ పే కస్టమర్లకు అలర్ట్..!
ఎలా అప్డేట్ చేసుకోవాలి?
మన భారత ప్రభుత్వం కొత్త అప్డేటెడ్ క్రోమ్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచన చేస్తోంది. ఈ కొత్త అప్డేట్ 22 రకాల security fixes సరిచేస్తుంది. CERT-In నివేదిక ప్రకారం, హ్యాకర్లు వినియోగదారుల ప్రైవేట్ సమాచారాన్ని సేకరించి.. ఇల్లీగల్ గా వాడుకొనే ప్రమాదం లేకపోలేదు. అలాగే వారు పరికరంలోకి మాల్వేర్ను ఇంజెక్ట్ చేయవచ్చు. అందువల్ల గూగుల్ వీలైనంత త్వరగా తమ బ్రౌజర్ను అప్గ్రేడ్ చేయాలని వినియోగదారులను కోరుతోంది.
Google pay: అదిరిపోయే ఫీచర్ తో గూగుల్ పే …!
Google ను ఇలా అప్డేట్ చేయండిలా.. ముందుగా గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్ కి వెళ్ళాలి. తరువాత About section of Google క్రోమ్ కి వెళ్లి, వెర్షన్ చెక్ చేసుకోవాలి. అక్కడ update అవసరమైతే సూచిస్తుంది. వెంటనే update చేయండి.