Allu Arjun Pushpa : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న ఈ విషయం అందరికీ తెలిసిందే.. ఈ సినిమా యూనిట్ అంతా ఇప్పుడు షూటింగ్ నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవిలో ఉంది.. ఈ నేపథ్యంలో పుష్ప యూనిట్ లో విషాదం చోటుచేసుకుంది.. ఈ సినిమా కోసం పని చేస్తున్నా ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు..
పుష్ప షూటింగ్ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వెళ్ళిన జి.శ్రీనివాస్ శుక్రవారం ఉదయం షూటింగ్ లొకేషన్ లో అస్వస్థకు గురయ్యారు. గుండెపోటుతో కుప్పకూలి పోవడం తో వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్ చికిత్స నిమిత్తం లొకేషన్లో ఉన్న అంబులెన్స్ లో రాజమండ్రి తీసుకువస్తున్నా క్రమంలో ఆయన దారిలోనే మరణించారని చిత్ర యూనిట్ తెలిపింది. సుమారు 200 సినిమాలకు పైగా శ్రీనివాస్ స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాస్ మృతి పట్ల పుష్ప టీం తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు .
తెలుగు , తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు జనవరి 28న చిత్ర యూనిట్ ప్రకటించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!