Anandaiah Medicine: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఖ్యాతి దశధిశలా వ్యాపించింది. చాలా సంవత్సరాలుగా ఆనందయ్య ఆయుర్వేద వైద్యం నిర్వహిస్తున్నా రాని పేరు ప్రఖ్యాతులు ఆయన ఉచితంగా పంపిణీ చేస్తున్న కరోనా మందును ప్రభుత్వం నిలుపుదల చేయడంతో వచ్చింది. నేడు ఆయన ఖ్యాతి పొరుగు రాష్ట్రాలకు తెలిసింది. ఆనందయ్య పంపిణీ చేసిన ఆయుర్వేద ఔషదంతో వేలాది మంది కరోనా నుండి విముక్తి కావడంతో మౌత్ పబ్లిసిటీ ద్వారానే నెల్లూరు పరిసర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రం తమిళనాడు, కర్నాటక నుండి వందలాది మంది కృష్ణపట్నం వచ్చి మందులు తీసుకువెళ్లేవారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో లోకాయుక్త ఆదేశాలతో అధికారులు ఆనందయ్య మందు పంపిణీని నిలుపుదల చేశారు.
Read More: Delta Plus: కలవరపెడుతున్న డెల్టా ప్లస్..! మధ్యప్రదేశ్లో రెండు మరణాలు నమోదు..!!
ఆ తరువాత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం..ఆనందయ్య మందుపై పరిశోధనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్, ఆయుష్ తదితర వైద్య బృందాలు ఆనందయ్య తయారు చేసిన మందులపై పరిశోధనలు జరిపి ప్రమాదకరం కాదని నిర్ధారించడం, దాంతో హైకోర్టు కూడా మందు పంపిణీకి అనుమతులు ఇవ్వడం తెలిసిందే. అనంతరం ప్రభుత్వ సహకారం లభించకపోయినా ఆనందయ్య వివిధ రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో వారి వారి నియోజకవర్గాల్లో పంపిణీకి మందు తయారు చేసి ఇస్తున్నారు. అనేక మంది నేతలు, ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా అనందయ్యను అబినందిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆయనను అభినందిస్తూ ఘనంగా సత్కరాలు చేస్తున్నారు.
తాజాగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఆనందయ్యను ప్రశంసించారు. డీఆర్డీఓ తయారు చేసిన 2 డీజీ మందుపై విచారణ సందర్భంలో ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపిలో కరోనాకు మందును తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అబినందించింది. న్యాయమూర్తులు జస్టిస్ కరుబాకరణ్, టీవీ తమిళ్ సెల్వీ లు ఆనందయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు.
ఆయుర్వేద వైద్యులను కేంద్రం ప్రోత్సహించాలని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంలో భారతీయ ఎడిసన్ గా పేరుగాంచిన జీడీ నాయుడును ధర్మాసనం గుర్తు చేస్తూ అలాంటి అత్యుత్తమ ఆవిష్కర్తలు కూడా ఉంటారన్నారు. అందరూ రామన్ పిళ్లై లాంటి మోసగాళ్లు ఉంటారన్న ఆందోళన తగదని అన్నారు. బయో ఇంథనం పేరుతో జనాలను మోసం చేసిన కేసులో రామన్ పిళ్లై అరెస్టు అయిన సంగతి తెలిసిందే.