Anasuya : ప్రస్తుతం టాలీవుడ్ లో అనసూయ క్రేజ్ ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంది. ఈ క్రేజ్ ఒక రోజులోనో రెండు రోజుల్లోనో వచ్చింది కాదు. ఎన్ని ఏళ్ళు కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ వరసగా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది.
క్షణం, రంగస్థలం సినిమాలలో పర్ఫార్మెన్స్ ని మెచ్చిన దర్శకులు, నిర్మాతలు తన కోసం క్యూ కడుతున్నారు. సినిమాలో చేస్తున్నాను కదా అని ఊరుకోకుండా బుల్లితెర మీద హాట్ హాట్గా కనిపించి సందడి చేస్తూనే ఉంది.
ఈ క్రేజ్ ని సంపాదించడానికి ఎన్నో పరాభవాలు చవిచూడాల్సి వస్తుంది. వాటన్నిటిని దాటుకొని స్టార్ స్టేటస్ దక్కించుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. ఒక్కోసారి అదృష్టం కుడా వెన్నంటే ఉండాలి. అయితే అనసూయ కి మాత్రం కష్టం తో పాటు ఆ అదృష్టం కూడా బాగానే కలిసి వచ్చింది. ఇప్పటి
వరకు బుల్లితెర, వెండితెర మీద సక్సస్ సాధించిన వాళ్ళు తక్కువ. కాని అనసూయ రెండు చోట్లా తన సత్తా చాటింది. రీసెంట్గా చావుకబురు చల్లగా సినిమాలో స్పెషల్ నంబర్ లో కనిపించి ప్రేక్షకులని కనువిందు చేస్తుంది. ఈ పాటకు 15లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుందట. అంటే అనసూయ
పాపులారిటీ ఏంటో దీన్ని బట్టే అర్థమవుతోంది.
Anasuya : అలాంటి క్రేజ్ అనసూయకి రావడం వల్ల తనని సంప్రదిస్తున్నారు.
ప్రస్తుతం రంగ మార్తాండ, మాస్ మహారాజా నటిస్తున్న ఖిలాడి సినిమాలు చేస్తోంది. ఖిలాడి సినిమా షూటింగ్ కోసం ఇటలీలో ఉంది. కాగా శర్వానంద్, సిద్దార్థ్ నటిస్తున్న మహా సముద్రంలో కూడా ఒక స్పెషల్ నంబర్తో సందడి చేస్తుంది. మాములుగా అయితే సినిమా ప్రమోషన్స్ కి స్పెషల్ బజ్ క్రియేట్
చేయడానికి హీరోయిన్స్ అయిన తమన్నాని సరి లేరు నీకెవ్వరు లో అలాగే రంగస్థలంలో పూజా హెగ్డే ని తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి క్రేజ్ అనసూయకి రావడం వల్ల తనని సంప్రదిస్తున్నారు. అందుకేనేమో తను ఈ సక్సస్ ను బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది. తన ఆ ఆనందాన్ని తనలో నే దాచుకోకుండా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!