మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.. అఆ సినిమాతో ఓనమాలు నేర్చుకున్న అనుపమ ప్రేమమ్ సినిమా తో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.. అద్భుతమైన నటన, క్యూట్ లుక్స్ తో లక్షలాది మంది అభిమానుల్లో విపరీతమైన క్రేజ్.. తెచ్చుకుంది.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా హీరో నిఖిల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి బాచుపల్లిలో మొక్కలు నాటి ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది..! ఈ చాలెంజ్ గురించి అనుపమ పరమేశ్వరన్ ఇలా.. వివరించింది..!
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎంపీ సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపింది.. అంతేకాకుండా ఈ గ్రీన్ ఇండియా ఛానల్ ను ఛాలెంజ్ను సోషల్ మీడియా ద్వారా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసురు తానని చెప్పింది.. ఈ కార్యక్రమంలో మమత ఎండి నరేన్ రాజ్ పాల్గొన్నారు..అయితే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు కూడా స్వీకరించి మిగతా వారికి ఈ ఛాలెంజ్ ను విసిరారు..!