Anushka: తన నటన మరియు అందచందాలతో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క శెట్టి. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నది. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించనున్నది అనుష్క. సాధారణముగా నటీనటులు ఏదైనా సినిమా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారు వెంటనే కాల్ షీట్స్ ను ఇవ్వలిసి ఉంటుంది.
కానీ అనుష్క విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంది అంటున్నారు ఆ చిత్ర నిర్మాతలు. ఈ సినిమా ఒకే అయ్యి ఇప్పటికే పది రోజులు అవుతున్నా, ఇప్పటికి స్వీటీ నుంచి కాల్ షీట్స్ దొరకడం లేదట. దీనితో నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను వాయిదా వేయనున్నట్లు సమాచారం.
అనుష్క శెట్టి అరుంధతి, భాగమతి మరియు నిశ్శబ్దం వంటి ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిశ్శబ్ధం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యిందనే చెప్పాలి. నటన పరంగా అనుష్క కు మంచి మార్కులే లభించాయి కానీ ఆ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. ఇది దృష్టిలో పెట్టుకుని స్వీటీ ఆచితూచి అడుగులు వేస్తుంది అందుకే ఇంకా కాల్ షీట్స్ ఇవ్వకుండా ఆలోచిస్తుంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకి స్వీటీ ఎందుకు కాల్ షీట్స్ ఇవ్వడానికి ఆలోచిస్తుంది అన్న విషయమై క్లారిటీ రావలిసి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!