అమరావతి : 14రోజుల పాటు జరిగిన ఏపి బడ్జెట్ సమావేశాల్లో 20కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం శాసనసభ సమావేశాలను స్పీకర్ తమ్మినేని నిరవధికంగా వాయిదా వేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ బిల్లులపై సుదీర్ఘ చర్చ జరగడం మంచి పరిణామం అని అన్నారు. పేదల సంక్షేమమే అజెండాగా అసెంబ్లీ సమావేశాలు సాగాయన్నారు. సభా నాయకుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు తమ్మినేని పేర్కొన్నారు.
previous post
next post