న్యూఢిల్లీ: అమేఠీ రాజకుటుంబానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అస్సాం నుండి రాజ్యసభకు ఎన్నికైన సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడుకి అందజేయగా ఆయన ఆమోదించారు. బుధవారం బిజెపిలో చేరుతున్నట్లు సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు.
అంతకు ముందు ఆయన బిజెపిలోనే ఉన్నారు. 1990వ దశకంలో ఆ పార్టీ టికెట్ పై లోక్సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ని అమేఠీ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నాయకుడు సంజయ్ సింగ్.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుల్తాన్పూర్ లోక్సభ నియోజకవర్గ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ ఆయనపై బిజెపి అభ్యర్థి మేనకా గాందీ విజయం సాధించారు.
previous post