బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ నూతన స్పీకర్గా బిజెపి సీనియర్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్దే కగేరి నియామకం ఖరారయింది. ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
స్పీకర్ పదవికి రమేష్కుమార్ సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
విశ్వాసపరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి యడియూరప్ప స్పీకర్ అభ్యర్థిగా విశ్వేశ్వర హెగ్దేను ఎంపిక చేశారు. మంగళవారం స్పీకర్ అభ్యర్థిగా హెగ్దే తన నామినేషన్ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి ఎంకె వరలక్ష్మికి అందజేశారు. ఆయనతో పాటు సిఎం యడియూరప్ప, బిజెపి ఎమ్మెల్యేలు గోవింద్ కజ్రోల్, ఆర్ అశోక్, జగదీశ్ షెట్టర్, ఈశ్వరప్ప, సురేష్కుమార్లు పాల్గొన్నారు.హెగ్దే ఒక్కరే నామినేషన్ పత్రాలు సమర్పించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు.
విశ్వేశ్వర హెగ్దే కగేరి 1994 నుండి వరుసగా ఆరు సార్లు అంకోలా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత బిజెపి ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.