అమరావతి: ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 10.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను గవర్నర్ నరసింహన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అందజేసిన విషయం తెలిసిందే.
ఈ జాబితాను గవర్నర్ ఆమోదించి జిఎడికి పంపారు.
శనివారం ఉదయం గవర్నర్ నరసింహన్ సచివాలయ ఆవరణలో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.