మాజీ మంత్రి, శాసన సభ ప్రతి పక్ష ఉప నేత టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఇల్లు నిమ్మాడ లో ఎసిబి అధికారులు దాడులు. తెల్లవారి జామున గ్రామానికి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఎసిబి అధికారులు.అచ్చన్నాయిడు ను అదుపులోకి తీసుకొని ప్రత్యేక బస్సులో తీసుకెళ్లిన ఎసిబి అధికారులు ఈ ఏస్ ఐ నిధులు దుర్వినియోగం పై ఆరోపణలు నిమ్మాడ గ్రామంలో ప్రత్యేక బలగాలను మోహరించిన పోలీసులు.
దాదాపు రూ.998 కోట్ల రూపాయల స్కామ్ లో ఈ మాజీ మంత్రిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక పోతే చంద్రబాబు హయంలో అచ్చెన్నాయుడు ఉపాథి మరియు శ్రామికుల శాఖ కు మంత్రి గా పని చేసిన విషయం తెలిసిందె. గత కొద్ది నెలలుగా వైసీపీ ప్రభుత్వం ఈయన పై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఉండగా ఎట్టకేలకు ఏసీబీ అధికారు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెన్ట్ డైరెక్టరేట్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం అయనను పక్కా ఆధారలతో అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా తదుపరి విచారణ కోసం ఆయనను వైజాగ్ కు తరలించారు. అతనితో పాటు తిరుపతిలో ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ ను కూడా ఏకకాలంలో అరెస్టు చేయడం విశేషం.
ESI మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయంటూ మూడు నెలల కిందట విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దీనిలో ప్రముఖంగా మాజీ మంత్రి మాజీ మంత్రి అచ్చనాయుడు పేరు బాధ్యుడిగా పేర్కొన్నారు. ఆయన సిఫార్సుతో నామినేషన్ పద్దతిలో కంపెనీలకు కేటాయింపులు చేసారనేది ఆరోపణ. ESI రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు 51కోట్లు చెల్లించారని నిర్ధారించారు. లేని కంపెనీల నుంచి కొటేషన్లు., వాటి ద్వారా పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు. వాస్తవ ధరల కంటే 136శాతం అధిక ధరలకు మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు చేశారని విజిలెన్స్ గుర్తించింది. ESI డైరెక్టర్లకు సహకరించిన ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు. ESI డైరెక్టర్లు రవి కుమార్, రమేష్, విజయ లు అక్రమాలకు బాద్యులుగా గుర్తించారు. నామినేషన్ పద్దతిలో టెండర్లు ఇప్పించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఈ కేసులో అచ్చెన్నాయుడు ని ఈరోజు ఉదయమే అరెస్టు చేసినట్టు సమాచారం.