అసెంబ్లీ మార్షల్స్పై టీడీపీ సభ్యులు దాడి చేయడం సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్గా తనకు ఉన్న అధికారం ప్రకారం నిర్ణయం తీసుకున్నానని దానికి మార్షల్స్ ఏమి చేస్తారు అని ప్రశ్నించారు. సభ సజావుగా జరగడానికి సభ్యులు సహకరించాలి కానీ చైర్ ఆదేశాలను పాటించే మార్షల్స్పై దురుసుగా ప్రవర్తించడం సరికాదని అన్నారు. మార్షల్స్ ఇచ్చిన ఫిర్యాదును ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నామని స్పీకర్ తమ్మినేని తెలిపారు. అనంతరం ఏపి అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.
తొలుత టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సమయంలో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులను బయటకు పంపే క్రమంలో మార్షల్స్ పై పలువురు టీడీపీ సభ్యులు దాడి చేశారని అధికార పక్ష సభ్యులు పేర్కొన్నారు. మార్షల్స్ పై టీడీపీ సభ్యులు ఏలూరి సాంబశివరావు, అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. మార్షల్స్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్కు వైసీపీ పిర్యాదు చేసింది. మార్షల్స్ నుండి స్పీకర్ పేషీ సమాచారం తీసుకున్నది.