సమాజంలో ఒక మనిషికి మరొక మనిషి సహాయం చేసుకోవడమే కాదు.. ప్రకృతిలో ఉండే ఇతర జీవరాశులు కూడా అవసరం వచ్చినప్పుడు ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. ప్రాణాపాయ స్థితిలో ఉంటే జాతి భేదం లెక్క చేయకుండా కొన్ని జీవులు ఇతర జీవులను రక్షిస్తాయి. అవును.. సరిగ్గా అలాగే జరిగింది. ఒడ్డున పడ్డ ఓ చేపను పంది పిల్లలు రక్షించాయి.
ఓ నది ఒడ్డున పడ్డ చేపను కొన్ని పంది పిల్లలు దొర్లిస్తూ తిరిగి నీళ్లల్లో పడేశాయి. దీంతో ఆ చేప బతికిపోయింది. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 11 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. అనేక మంది షేర్ చేశారు. లైక్ కొట్టారు.
The smallest act of kindness
Is worth more than the greatest intention? pic.twitter.com/eQijHBxkUM— Susanta Nanda IFS (@susantananda3) August 23, 2020
అయితే ఆ వీడియో పట్ల నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఆ పందులు చేసిన పనిని కొందరు మెచ్చుకుంటుంటే.. కొందరు మాత్రం చేప అప్పటికే చనిపోయిందని అంటున్నారు. ఇక కొందరు ఆ చేపను పంది పిల్లలు తినాలని అనుకుని ఉంటాయని, కానీ అది వాటికి నోటికి దొరకలేదని, దీంతో అవి ఆ చేపను దొర్లిస్తూ ముందుకు సాగాయని అంటున్నారు.