LK Advani: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప రాష్ట్రపతి లాల్ కృష్ణ అడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను ప్రధానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి అడ్వాణీ హజరుకాలేకపోయారు.
దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.
ఎల్ కే అద్వాణీ బీజేపీని బలోపేతం చేయడంలో ఎంతగానో శ్రమించారు. 1990వ దశకంలో ఆయన రథయాత్ర చేపట్టిన తర్వాత బీజేపీ జాతీయ రాజకీయాల్లో పేరు సంపాదించుకుంది. 1980లో బీజేపీని స్థాపించిన తర్వాత అత్యధికారం ఆ పార్టీకి లాల్ కృష్ణ అద్వాణీ అధ్యక్షుడుగా ఉన్నారు.
తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్శింహరావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను శనివారం మరణానంతరం ప్రధానం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్ లో ద్రౌపదీ ముర్ము నుండి పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు దీనిని స్వీకరించారు. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ లకు కూడా మరణానంతరం ప్రకటించిన ఈ పురస్కారాలను వారి వారి కుటుంబ సభ్యులు స్వీకరించారు.
Telangana Congress: కాంగ్రెస్ గూటికి చేరిన కడియం శ్రీహరి, కావ్య .. ఆ లోక్ సభ స్థానం ఖాయమైనట్లే..!