కింగ్ నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 6 వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఈ బిగ్ రియాలిటి షో ప్రారంభం కావడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు పక్కాగా క్లారిటీ రానిది మాత్రం ఈ సీజన్ 4 లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ ఎవరు అని.
అంత గోప్యంగా కంటెస్టెంట్స్ విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు నిర్వాహకులు. ఇప్పటికే సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా గత నెల రోజులుగా ఈసీజన్ లో ప్రముఖ డాన్స్ మాస్టర్ రఘు, ఆయన భార్య సింగర్ ప్రణవి ఉంటారంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు వారు ఈ విషయాన్ని అటు రఘు మాస్టర్ గాని, ఆయన భార్య సింగర్ ప్రణవి గాని ఖండించలేదు. దాంతో అందరూ సీజన్ 4 లో ఈ జంట పాల్గొనడం నిజమేనని ఫిక్సైయ్యారు. అయితే చివరి నిమిషంలో ఈ జంట షో కు నో చెప్పారనే ప్రచారం మొదలైంది.
అందుకు కారణం గట్టిదేనని కూడా వార్తలు వస్తున్నాయి. సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు బిగ్ బాస్ లో జంటగా వెళ్లడం అంటే చాలా పెద్ద రిస్క్ తీసుకోవడమేనని.. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే హౌజ్ లో రాణించగలరని చెప్పారట. అంతేకాదు ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకోగా ఈ రియాలిటీ షో లో పాల్గొన్న వాళ్ళెవరికి ఆ తర్వాత కెరీర్ ఏమంత గొప్పగా ఉండదని ఇప్పటికే చాలా మంది అభిప్రాయపడ్డారు.
ఇదే అందరూ రఘుకు సలహా ఇచ్చారని …ఈ కారణంగానే రఘు దంపతులు బిగ్ బాస్ షో నుంచి డ్రాపయ్యారని ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ఇదే గనక నిజమయితే ఈసారి హౌస్ లో స్టార్ కపుల్ లేనట్లేనని భావించాలి. గత సీజన్ లో వరుణ్.. వితికలు సందడి చేసిన విషయం తెల్సిందే. ఈసారి అలాంటి స్పెషల్ అట్రాక్షన్స్ ఏవీ ఉండే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికే ఫిజికల్ టాస్క్ లు ఉండవని తెలిసిందే. ఇప్పుడు ఇది కుడా నిజం అయితే బిగ్ బాస్ ఈ సారి ఎలా ఉంటుందో అని అనుమానాలు మొదలయ్యాయట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!