Bigg Boss: బిగ్ బాస్ Bigg Boss షో దేశంలో ఎంత పాపులర్ అయిందో తెలిసిన విషయమే. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో వస్తోంది. ప్రతి సీజన్ కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేంతగా ప్రజల్లో ఈ షో పాపులర్ అయింది. టాస్క్స్, అల్లరి, గొడవలు, సరదాలతో 100 రోజులకు పైగా ప్రసారమయ్యే ఈ షోలో సెలబ్రిటీలు పాల్గొంటారు. పెద్దగా పేరున్న వాళ్లు వస్తే సెలబ్రిటీలు అవుతున్నారు. అయితే.. ఈ ఏడాది బిగ్ బాస్ షో అన్ని భాషల్లో ఎప్పుడు తెరకెక్కుతుందో తెలీని పరిస్థితి. అయితే.. మళయాళంలో బిగ్ బాస్ షో రన్ అవుతోంది. ఇప్పుడీ షోను తమిళనాడు పోలీసులు అడ్డుకుని సీజ్ చేయడం సంచలనం రేపుతోంది.
మళయాళంలో బిగ్ బాస్ 3 సీజన్ ఫిబ్రవరి 14న ప్రారంభమైంది. అప్పటికి దేశంలో కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. దీంతో షో రన్ అవుతోంది. దీనికి హోస్ట్ గా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వ్యవహరిస్తున్నారు. అయితే.. మళయాళ బిగ్ బాస్ ను చెన్నైలోని ఈవీపీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో జరుగుతోంది. అయితే.. ప్రస్తుత కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ షోపై పడింది. తమిళనాడులో లాక్ డౌన్ నిబంధనలు మరో రెండు వారాలు పొడిగించిన నేపథ్యంలో ఈషోను తాత్కాలికంగా రద్దు చేశారు. మే 19.. బుధవారం రాత్రి పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు, తిరువళ్లూరు ఆర్డీవో సెట్ కు వెళ్లి నిర్వాహకులకు షో ఆపేయాలని ఆదేశించారు. సెట్ కు సీల్ వేశారు.
ఫిబ్రవరిలో 14మందితో ప్రారంభమైన షోలో ప్రస్తుతం ఉన్న 8 మంది పార్టిసిపెంట్స్ ను హోటళ్లకు తరలించారు. దీంతో షో తాత్కాలికంగా నిలిపేసినట్టు మళయాళ బిగ్ బాస్ యాజమాన్యం ప్రకటించింది. అయితే.. కంటెస్టెంట్స్ తో సంబంధం లేని బిగ్ బాస్ టీమ్ 6గురికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. వారందరినీ క్వారంటైన్ లో ఉంచినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ జరపడం వల్ల లక్ష రూపాయల ఫైన్ విధించారు. 100వ ఎపిసోడ్ కు 5 రోజులే మిగిలి ఉన్న నేపధ్యంలో షో క్యాన్సిల్ అయింది. దీంతో కేరళ వెళ్లేందుకు ఈపాస్ ఇప్పించాలని టీమ్ కోరినట్టు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!