ఈమధ్య బిగ్ బాస్ రేటింగ్ లు చాలా దారుణంగా పడిపోయినట్లు తెలుస్తోంది. కనీసం సీరియల్స్ రేంజ్ కూడా అందుకోవడంలో విఫలం అవుతోంది. ఇక నాగార్జున కూడా రేటింగ్స్ విషయంలో ఏమాత్రం సంతృప్తిగా లేడని అర్థమవుతోంది. అందుకే ఇవాళ వివాదాల డోస్ పెంచాలని నిర్ణయించుకున్నట్లు ఉన్నాడు. ఈ వారం నామినేషన్ కోసం నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేశారు. సరికొత్త తరహాలో నామినేషన్స్ నిర్వహిస్తున్నారు.
గొడవలు క్రియేట్ చేసేందుకు టాస్క్ లో భాగంగా ఒక గేమ్ సెట్ చేశారు. బంగారు కిరీటం ధరిస్తే వారు ఇష్టం వచ్చినట్లు ఆదేశాలు జారీ చేసి పరిపాలించ వచ్చు. కొద్దిసేపటి తర్వాత ఆ కిరీటం మరొకరి దగ్గరికి వెళుతుంది. అప్పుడు వారు ఇంటిని ఏలుతారు. ఇక సోహెల్ కిరీటం వచ్చి రాగానే అరియానాకు నరకం చూపించాడు. అయితే ఆ తర్వాత హారికకు ఈ కిరీటం దగ్గరికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హారిక అభిజిత్, సోహెల్ ను తన దగ్గరికి రమ్మని పిలిచింది కానీ ఎవరు ఆమె మాటను లెక్క చేయలేదు.
హారిక రాజు కావడం ఏమిటి అని నవ్వుకున్నారు. అఖిల్ మాత్రం ఆమె పక్కనే ఉన్నాడు. 10 సెకన్లలో తన దగ్గరికి రాకపోతే మీ బట్టలు స్విమ్మింగ్ పూల్ లో వేస్తా అని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆ మాటలను పట్టించుకోలేదు వారు. నా బట్టలు పడేస్తే చుక్కలు చూపిస్తాం అంటూ సోహెల్ కౌంటర్ ఇచ్చాడు. హారిక చెప్పినట్లే అఖిల్ బట్టలు తెచ్చిహారి స్విమ్మింగ్ పూల్ లో పడేసింది. దీంతో ఇంటిలో వాతావరణం వేడెక్కింది. సోహెల్ చాలా సీరియస్ అయిపోయాడు. కోపంతో అతను కుర్చీ నేలకేసి కొట్టాడు.