గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కమలం పార్టీ సరికొత్త వ్యూహాలు వేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలలో విజయం సాధించడంతో గ్రేటర్ మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా వరదలు రావడంతో ప్రభుత్వం పై వ్యతిరేకత ప్రజలలో ఉన్నట్లు కామెంట్లు వస్తున్న నేపథ్యంలో ఇదే సరైన టైమ్ అని బీజేపీ భావిస్తోంది.
ఈ క్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఒకపక్క కేడర్ ని రెడీ చేస్తూనే మరోపక్క పార్టీ ప్రచారానికి కావలసిన మైలేజ్ ఈ విషయాలకు సంబంధించి దృష్టిపెట్టారు. ఈ క్రమం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బేటీ కాబోతున్నట్లు వార్త కన్ఫామ్ కావటంతో జనసేన బీజేపీ పొత్తు ఖాయమని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ని కేవలం ప్రచారం కోసమే బీజేపీ వాడ బోతున్నట్లు టాక్.
వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ని ప్రచారం కోసం తీసుకెళ్లాలని అప్పట్లో బీజేపీ నేతలు ప్రయత్నాలు చేయగా ఫలించలేదట. కానీ దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ గెలవడం అందరికీ తెలిసిందే. దీంతో గ్రేటర్ ఎన్నికలలో అయినా పవన్ కళ్యాణ్ వస్తాడని భావిస్తూ ప్రచారం కోసమే పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటె గ్రేటర్ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ని ప్రచారం కోసమే అన్నట్టుగా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కామెంటు చేయటంతో.. జనాలు రప్పించడం కోసమే పవన్ కళ్యాణ్ ని రాజకీయ నేతలు చూస్తున్నారని పరిశీలకుల మాట.