Breaking: మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు గతంలో ఎప్పుడు లేనంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓ వైపు ప్రకాశ్ రాజ్ తన టీంతో బరిలో నిలవగా, మరో వైపు మంచు విష్ణు సైతం తన టీంతో రంగం సిద్ధం చేసుకున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ రాజు లోకల్ కాదని విష్ణు టీం కామెంట్స్ చేస్తుండగా మెగా ఫ్యామిలీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రకాశ్ రాజుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇక కొన్నేండ్లుగా మనం చూస్తేనే ఉన్నాం. ‘మా’ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడం లేదు. సభ్యులు ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహణకు సహకరించరని టాక్. మీడియా ఎదుట ఎవరి డబ్బా వారే కొట్టుకోవడం, ప్రత్యర్థులపై విమర్శలు చేయడం కామన్గా జరుగుతూనే ఉన్నది. మరో రెండు రోజుల్లో మా ఎలక్షన్స్ నిర్వహణకు నోటిఫికేషన్ రానుంది. అంతకు ముందే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనేన్నారు.
MAA Elections: ‘మా’ ఎన్నికల్లో గెలుపెవరిది..?
మైక్ కనిపిస్తే అంతే..
ప్రకాశ్రాజ్ వర్గంపై, విష్ణు వర్గంపై ప్రకాశ్ రాజ్ వర్గం వారు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎవరూ ఎక్కడా తగ్గదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైక్ కనిపిస్తే ఈ విమర్శలు, ఆరోపణలు పీక్ స్టేజ్ కు చేరుకుంటున్నాయి. ఈ వ్యవహారంతో ఎలక్షన్స్పై సినీ పెద్దలకు ఇంట్రెస్ట్ పోయిందని టాక్. వీరిలో చిరుసైతం ఉన్నాడు.
MAA Elections: మా ఎన్నికలపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు..!!
చిరు వార్నింగ్..?
విష్ణు ప్యానెల్కు సీనియర్ హీరోలు బాలకృష్ణ, కృష్ణం రాజు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ప్రకాశ్రాజ్ ప్యానెల్కు మెగాస్టార్ చిరంజీవి మద్దతుగా ఉన్నాడు. మా ఎన్నికలల్లో ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు చూసిన చిరంజీవి ఈ విషయాలపై సీరియస్గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇది మనలోనే జరుగుతున్న ఎన్నికని, దీనిపై ఈ రేంజ్లో ఆరోపణలు, కామెంట్స్ చేసుకోవాల్సిన అవసరమేంటని రెండు వర్గాలపై చిరు కోపానికి గురైనట్టు తెలుస్తున్నది. ఎలక్షన్స్ అయిపోయే వరకు మాట్లాడకూడదంటూ చిరు నిర్ణయించుకున్నాడని టాక్. ఎలక్షన్ టైంలో ఇలా ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకుంటే పోయేది మనపరువేనని సభ్యులకు చిరు సిరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.