Breaking – Chiranjeevi : కరోనా వైరస్ కేసులు భారతదేశంలో పెచ్చుమీరుతున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వీరు కరోనా కోరల్లో చిక్కి కోవిడ్ 19 బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ బ్యాడ్ న్యూస్ ను స్వయాన చిరంజీవియే తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ప్రకటించారు.
” నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. నాలో నిన్న రాత్రి తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించాయి. అనుమానం వచ్చిన వెంటనే కోవిడ్ 19 పరీక్ష చేయించుకున్నాను. ఇందులో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లాను. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారందరినీ కూడా టెస్ట్ చేయించుకోవాలిసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను.” అని చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!