Breaking: కుప్పం మీదుగా చెన్నై వెళుతున్న రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. కుప్పం మండల పరిధిలోని బంగారునాతం రైల్వేగేట్ వద్ద రైలు బోగీలో నుండి పొగలు రావడంతో లోకోపైలట్ అప్రమత్తమైయ్యాడు. వెంటనే రైలును నిలుపుదల చేశాడు. దీంతో ప్రయాణీకులు ఒక్కసారిగా రైలు దిగి పరుగులు తీశారు. చివరకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని తెలియడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
అక్కడి నుండి నెమ్మదిగా సమీపంలోని మల్లానుర్ రైల్వేస్టేషన్ వరకూ వెళ్లి అక్కడ సమస్యను పరిష్కరించారు. ఈ కారణంగా బెంగళూర్ నుండి కుప్పం మీదుగా చెన్నై వెళ్ళు బృందావన్ సూపర్ ఫాస్ట్ రైలును 30 నిమిషాల పాటు కుప్పం లో నిలుపుదల చేశారు.