దర్శక దీరుడుగా రాజమౌళి జూనియర్ ఎన్.టి.ఆర్ తో తీసిన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో సింహాద్రి, యమదొంగ వచ్చి భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాయి. రాజమౌళి, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ ఎంతటిదో అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో మరో పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న రాజమౌళి .. ఈసారి బాహుబలి కంటే భారీ సక్సస్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. రౌద్రం రణం రుథిరం అన్న టైటిల్ తో ప్రముఖ నిర్మాత డివీవీ దానయ్య 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. పోరాట యోధులు కొమరం భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలతో ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.
కొమరం భీం గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజు గా రాం చరణ్ నటిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ తో పాటు హాలీవుడ్ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా ప్రారంభించినప్పుడే 2020 సమ్మర్ లో ఆర్ ఆర్ ఆర్ ని రిలీజ్ చేస్తామని రాజమౌళి వెల్లడించారు. కాని చిత్రీకరణ పూర్తి కాకపోవడం తో 2021 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మళ్ళీ రాజమౌళి అధికారకంగా ప్రకటించాడు. చరణ్ పాత్రని రివీల్ చేసినప్పుడు పోస్టర్ అండ్ వీడియో టీజర్ లో రిలీజ్ డేట్ ని వెల్లడించారు.
అయితే కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయి 2021 సమ్మర్ కి షిఫ్ట్ అయిందని అంటున్నారు. అయితే త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుందన్న వార్తలు రాగానే ఎన్.టి.ఆర్ అభిమానులు కొమరం భీం పాత్ర ని రివీల్ చేస్తూ టీజర్ వదులుతారేమో అని ఆశ పడ్డారు. కాని కరోనా కారణంగా అసలు 2020 లో ఆర్ ఆర్ ఆర్ సెట్స్ మీదకి వెళ్ళడం కష్టమని అంటున్నారట. దీన్ని బట్టి ఇక ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్.టి.ర్ టీజర్ రావడం సాధ్యం కాదని.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!