Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుంది. ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహాడ్ జైలులో ఉన్నందున ఆమెను ప్రశ్నించేందుకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది అలానే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది.
ఈ కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ లో హైదరాబాద్ లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజుల పాటు విచారించారు. తాజాగా కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సీబీఐ అధికారులు కవితను విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది.
గతంలో నమోదు చేసిన వాంగ్మూలం, అప్రూవర్ గా మారిన వాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్దమవుతున్నట్లు సమాచారం. కవితను ప్రశ్నించిన తర్వాత రాబడిన సమాచారంతో సీబీఐ ఈ కేసులో మరో చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.
ఏపీలో సీపీఐ పోటీ చేసే స్థానాలు ఇవే..