ఏపీలో కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఒక్క పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ పోటీ చేస్తొంది. సీట్ల ఒప్పందం కుదిరినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్ నందు ఏపి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాసంలో ఇరుపార్టీల మధ్య చర్చలు జరిగాయన్నారు.
సమావేశంలో షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర పార్టీ ప్రతినిధి కే రాజు, సీపీఐ నుండి రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సహ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు పాల్గొన్నారు. చర్చల్లో ఏయే స్థానాల్లో సీపీఐని బలపరుస్తుంది అనే అంశాన్ని ప్రకటించారు.
గుంటూరు లోక్ సభ స్థానంతో పాటు విశాఖపట్నం పశ్చిమ, ఏలూరు, విజయవాడ పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయనుందని రామకృష్ణ తెలిపారు.
YS Sharmila: వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి