NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి

YS Sharmila: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప జిల్లాలో ఇవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్ సభ్య అభ్యర్ధిగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. షర్మిల బస్సు యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిల్లి కృపారాణి, రామ్మోహన్ రావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భం లో వారికి షర్మిల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం కృపారాణి మాట్లాడుతూ..జగన్, వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టానని, అలాంటి తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వైఎస్ఆర్ అంటే దేవుడితో సమానమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. షర్మిలలో వైఎస్ఆర్ ను చూస్తున్నామన్నారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ఒక నియంత అని, ఆయనను గద్దె దించాలన్నారు. కడప ఎంపిగా షర్మిలకు అవకాశం కల్పించాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కృపారాణి 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి  పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి కింజరాపు ఎర్రన్నాయుడు చేతిలో పరాజయం పాలైయ్యారు. అయితే ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఎర్రంనాయుడుపై విజయం సాధించారు. తొలి సారి లోక్ సభకు ఎన్నికైనా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా పని చేశారు. 2014 ఎన్నికల్లో అదే లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోవడంతో కృపారాణి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.

పార్టీలో చేరిన మరుసటి వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా కృపారాణికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే ఆమెకు లోక్ సభ స్థానాన్ని కేటాయించలేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తగిన ఆమెకు ప్రాధాన్యత దక్కలేదు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించారు. ఈ సారి శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలని భావించినా పార్టీ అధిష్టానం అవకాశం కల్పించలేదు. దీంతో పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కృపారాణి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు.

CM Ramesh: అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ పై కేసు నమోదు

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju