టీడీపీ అధినేత చంద్రబాబు వలంటీర్లను ఉద్దేశించి చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరిం చుకుంది. తాము అధికారంలోకి వచ్చినా..వలంటీర్లను తొలగించబోమని అన్నారు. అంతేకాదు.. వారిని మరింత బలోపేతం చేస్తామని కూడా చెప్పారు. అయితే.. ఇది ఇప్పుడు అవసరమా? అనేది టీడీపీలో తురమీదకి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే.. మంచో చెడో ఒకసారి వలంటీర్లను వ్యతిరేకించారు. దీనిని ఇలానే కొనసాగిస్తే.. బాగుండేదని మెజారిటీ వర్గాలు అంటున్నాయి.
లేదా..అసలు ఈ విషయాన్ని పూర్తిగా వదిలేయడమే మంచిదని కూడా సూచిస్తున్నాయి. ఇలా కాకుండా.. ఎన్నికలకు ముందు మరోసారి వలంటీర్లను పెద్దోళ్లను చేయడం ద్వారా క్షేత్రస్తాయిలో టీడీపీ కార్యకర్తల కు ఇబ్బంది కల్పిస్తున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు.. చంద్రబాబు వ్యూహం వేరేగా ఉంద ని అంటున్నారు. ఈ క్రమంలోనే వలంటీర్లను మచ్చిక చేసుకు నే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతు న్నారు. వలంటీర్ల వ్యవహారం ప్రస్తుతం తటస్థంగా ఉంది.
వారికి వేతనాలు పెంచాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అదేసమయంలో గత ఏడాది వలంటీర్లు కూడా ఉద్యమాలు చేశారు. దీంతో వందల మంది ని వధుల నుంచి తప్పించారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని.. తమ వేతనాలు పెంచాలన్నదివారి ప్రధాన డిమాండ్. అయితే.. ఈ విషయంలో వైసీపీ అధినేత నుంచి ఎలాంటి స్పందనాలేదు. దీంతో వలంటీర్లలో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. దీంతో వీరు పైకి కనిపిస్తున్నంతగా.. వైసీపీకి అనుకూలంగా లేరనే వాదన ఉంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా వారిని తనకు చేరువ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సీనియర్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత.. వారి ఉద్యోగాలకు భరోసా ఇవ్వడంతో పాటు వారి వేతనాలను కూడా.. రూ.10-12 వేల మధ్యకు చేర్చేందుకు కూడా చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచా రం. దీనిని కూడా మేనిఫెస్టోలో చేర్చినాఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.