“సరిలేరు నీకెవ్వరు” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అంతా ఓకే అయితే అదే సమయంలో చివరిలో స్క్రిప్టు నచ్చకపోవడంతో.. చేంజ్ చేసిన గాని పెద్దగా నచ్చకపోవడంతో మహేష్ వంశీ పైడిపల్లి నీ పక్కన పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
మహర్షి వంటి భారీ బ్లాక్ బస్టర్ మహేష్ కి ఇచ్చి ఆ తరువాత సినిమా కూడా మహేష్ తోనే చేయాలని దాదాపు కొన్ని సంవత్సరాల పాటు స్క్రిప్టు వర్క్ చేసి వెయిట్ చేసినా గాని స్క్రిప్టు సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ని మహేష్ పక్కన పెట్టడం జరిగింది. అదే సమయంలో నెక్స్ట్ మహేష్ ఎవరితో చేస్తారు అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద సస్పెన్స్ గా మారింది.
ఇలాంటి తరుణంలో “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం చెప్పిన “సర్కారు వారి పాట” సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పని మీద ఉన్నారు మహేష్. ఇదిలా ఉంటే తాజాగా వంశీపైడిపల్లి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు స్క్రిప్ట్ కూడా చెప్పేసి ఓకే చేయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వస్తోంది. ఈ క్రమంలో “ఆర్ఆర్ఆర్” ఈ సినిమా పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి ప్రాజెక్టులో చరణ్ నటించే అవకాశం ఉన్నట్లు ఫిలిం వర్గాలలో టాక్. అంతేకాకుండా త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. గతంలో వంశీపైడిపల్లి రామ్ చరణ్ తో ఎవడు అనే సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. అయితే తాజాగా చరణ్ తో వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో అభిమానులు కూడా ఇది నిజమైతే బాగుండు అనే కామెంట్లు చేస్తున్నారు.