మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ మెగా ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోసారి సామాజిక అంశంతో పాటు మంచి సందేశంతో ఈ సినిమాని కొరటాల తెరకెక్కిస్తున్నారని ప్రేక్షకులందరికి ఒక క్లారిటీ వచ్చేసింది.
ఇక చాలా కాలం తర్వాత మెలోడి బ్రహ్మ మణిశర్మ ‘ఆచార్య‘ సినిమాకి సంగీతమందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తో కాలు కదిపింది. ఈ సాంగ్ అద్భుతంగా వచ్చిందని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించారు. కాగా ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఆచార్య కరోనా కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసినప్పుడు చిత్ర యూనిట్ ఆచార్య ని 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలో తాజాగా రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆచార్య 40 శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తయింది. ఇంకా 60 శాతం చిత్రీకరణ జరగాల్సి ఉండగా త్వరలో మొదలు కానుందట. అంతేకాదు శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ 9 ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఈ డేట్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ డేట్ కి టాలీవుడ్ లో చాలా సినిమాలు ప్రతీ సంవత్సరం రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. అందుకే ఆచార్య మేకర్స్ ఈ డేట్ లాక్ చేశారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!